ఓవర్సీస్ లో ఫ్యాన్సీ రేట్ కు '47డేస్'
- February 22, 2018సత్యదేవ్, పూజా ఝవేరీ జంటగా నటిస్తోన్న చిత్రం 47డేస్. ద మిస్టరీ అన్ ఫోల్డ్స్ అనేది ఉపశీర్షిక. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. సినిమాపై ముందు నుంచీ విపరీతమైన పాజిటివ్ టాక్ ఉంది. ఈ నేపథ్యంలో 47డేస్ ఓవర్శీస్ రైట్స్ ఫ్యాన్సీ రేట్ కు అమ్ముడైపోయాయి. త్రిశూల్ ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో విడుదల చేయబోతోంది. ఇందుకోసం ఫ్యాన్సీ రేట్ ను చెల్లించి మరీ హక్కులు కొనడం విశేషం.
ఈ మధ్య వస్తోన్న థ్రిల్లర్ మూవీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తోంది. ఓవర్సీస్ లో కూడా ఇలాంటి డిఫరెంట్ థ్రిల్లర్ మూవీస్ మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. అందుకే ఈ మూవీ అవుట్ పుట్ తెలిసిన త్రిశూల్ ఫిలిమ్స్ ఫ్యాన్సీ రేట్ కు ఈ హక్కులు దక్కించుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా బిజినెస్ పరంగా మంచి ఆఫర్స్ వస్తున్నాయని చెబుతోంది మూవీ టీమ్. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంగా వస్తోన్న ఈ చిత్రంలో లవ్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ కూ మంచి స్కోప్ ఉంటుంది. రఘు కుంచె సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలోని ఓ పాటను ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా పూరీ జగన్నాథ్ చేతుల మీదుగా విడుదల చేశారు. నూతన గాయని నీహా పాడిన ‘క్యా కరూ మై క్యా కరూ’ అనే మెలోడీకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. గాయని నీహా టాలెంట్ చూసిన ప్రతి ఒక్కరూ టాలీవుడ్ కు మరో అందమైన గాత్రం దొరకిందని ప్రశంసిస్తున్నారు. ఈ పాటతో తను మరో ప్రియా ప్రకాష్ వారియర్ అయిపోతుందంటున్నారు. శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్ డొంకాడ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 47 మిస్టరీ అన్ ఫోల్డ్ ను ఈ వేసవిలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్
తాజా వార్తలు
- పాలస్తీనాకు పరిష్కారాన్ని అందించండి.. అదొక్కటే సమస్యకు కారణం.. సౌదీ అరేబియా..!!
- బహ్రెయిన్ స్కూల్ గేమ్స్ 2024.. ISF ప్రతినిధి బృందం పరిశీలన..!!
- 'లులు వరల్డ్ ఫుడ్' ఫెస్టివల్.. ప్రపంచవ్యాప్తంగా వెరైటీలన్నీ ఒకచోట..!!
- యూఏఈలో క్రెడిట్ కార్డ్ మోసాలు.. రుణాలతో బురిడీ కొట్టిస్టున్న మోసగాళ్లు..!!
- రియాద్ నాన్-ప్రాఫిట్ ఫౌండేషన్కు క్రౌన్ ప్రిన్స్ నాయకత్వం.. లక్ష్యాలు వెల్లడి..!!
- నేషనల్ మ్యూజియాన్ని సందర్శించిన SCMR హెడ్..!!
- అమెరికాతో యూఏఈ ఒప్పందం.. ఇకపై సులభంగా ఎంట్రీ..!!
- అక్టోబర్ 4 నుండి షార్జాలో ఉచిత రొమ్ము క్యాన్సర్ పరీక్షలు..!!
- బంగ్లాదేశీయులకు క్షమాపణలు..మానవ హక్కుల సంఘాల ప్రశంసలు..!!
- ధోఫర్లో సునామీ వాతావరణ మార్పులపై అవగాహన ప్రచారం..!!