ఫుట్ బాల్ అభిమానుల కోసం ఫిపా వరల్డ్ కప్ లాస్ట్ మినిట్ సేల్ నేటి నుంచి మొదలు
- September 27, 2022ఖతార్ : ఫిఫా వరల్డ్ -2022 మరికొన్ని రోజుల్లో మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఈ సారి మెగా టోర్నీని ఖతార్ నిర్వహిస్తోంది. ఇప్పటికే చాలా వరకు టికెట్లు అమ్ముడయ్యాయి. ఐతే ఫుట్ బాల్ అభిమానుల కోసం ఖతార్ లాస్ట్ మినిట్ సేల్ ప్రారంభిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇవాళ్టి నుంచి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు టికెట్లను ఆన్ లైన్ లో పొందవచ్చు. టోర్నమెంట్ పూర్తయ్యే వరకు లాస్ట్ మినిట్ సేల్ ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. టికెట్ల ను ఆన్ లైన్ లో FIFA.com/tickets ద్వారా పొందవచ్చు. ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్ పద్దతి లో సేల్ ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. మ్యాచ్ టికెట్లను నాలుగు కేటగిరీలో అందుబాటులో ఉంచారు. ఖతార్ వాసుల కోసం ప్రత్యేకంగా ఓ కేటగిరీ ఏర్పాటు చేశారు. ఒక్క వ్యక్తి ఒక్కో మ్యాచ్ గరిష్టంగా 6 టికెట్లను కొనుక్కోవచ్చు. ఇక FIFA కూడా ఒక ప్రత్యేకమైన టికెటింగ్ యాప్ను విడుదల చేయనుంది. దాన్ని టికెట్ కొనుకున్న వారు డౌన్ లోడ్ చేసుకోవాలి. తమ టికెట్ ను ఈ యాప్లో అప్లోడ్ చేసుకోవాలి. అభిమానులు స్టేడియంలోకి ప్రవేశించినప్పుడు వీటిని యాక్టివేట్ చేస్తారు. టికెటింగ్ యాప్తో పాటు, స్థానిక మరియు అంతర్జాతీయ అభిమానులందరూ తప్పనిసరిగా డిజిటల్ హయ్యా (ఫ్యాన్ ఐడీ) ని దరఖాస్తు చేసుకోని పొందాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- పాన్ కార్డు స్కామ్లతో జాగ్రత్త..
- విశాఖ స్టీల్ ప్లాంట్ పై స్పెషల్ ఫోకస్..
- లోక్సభలో పవన్ పై ప్రశంసలు కురిపించిన ఎంపీ బాలశౌరి
- ప్రధాని మోదీని కలిసిన గవర్నర్ దత్తాత్రేయ
- రౌడీయిజం, హింస, అక్రమాలు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఉద్యోగాలు లేకుండానే యూఏఈకి ప్రవాసుల రాక.. అధ్యయనం
- HMC సెప్సిస్ డ్యాష్బోర్డ్.. పేషంట్లకు మెరుగైన సేవలు
- ఒమన్లో ట్రంప్ ఇంటర్నేషనల్ రిసార్ట్ ప్రారంభం
- డైరీ బాటిళ్లలో తేడాలు..సౌదీ ఛాంబర్స్ ఫెడరేషన్ క్లారిటీ
- యూఏఈ నివాస వీసా రద్దయిందా? ఇలా దరఖాస్తు చేయండి..