ఆర్థిక మంత్రిత్వ శాఖ నెట్వర్క్ పై సైబర్ దాడి..!
- September 19, 2023కువైట్: తమ నెట్వర్క్ పై సైబర్టాక్ జరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. భద్రత, రక్షణ ప్రోటోకాల్ సిస్టమ్ను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగినట్లు పేర్కొంది. ప్రమాదాన్ని గుర్తించిన నిపుణులు హార్డ్వేర్ పరికరాలను డిస్కనెక్ట్ చేసి వేరు చేసారని తెలిపింది. అయితే, ప్రభుత్వ ఫైనాన్షియల్ సర్వర్లను హ్యాక్ చేయడానికి ప్రయత్నించారని, కానీ సాలరీ బదిలీ నెట్వర్క్ ప్రభావితం కాలేదని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హ్యాక్కు సంబంధించిన అప్డేట్ల కోసం మంత్రిత్వ శాఖ నేషనల్ సైబర్సెక్యూరిటీ సెంటర్తో సంప్రదింపులు జరుపుతోందని తెలిపింది.
తాజా వార్తలు
- హైదరాబాద్, విశాఖ నుంచి కొత్తగా మరిన్ని విమాన సర్వీసులు...!
- తిరిగి ఆనంద్ కు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ గా బాధ్యతలు..!!
- వినాయక పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మూడు జోన్లుగా హైడ్రా !
- గదిలో, బాత్రూంలో స్పై కెమెరాలు ఉంటే ఎలా గుర్తించాలి?
- మరింత ఈజీగా ఫ్లైట్ టికెట్ బుకింగ్
- నేడు శ్రీసప్తముఖ మహా శక్తి గణపతి పూజలో సీఎం రేవంత్
- 5.40లక్షల మంది సందర్శకులను ఆకర్షించిన ఆర్ట్ గ్యాలరీలు..!
- ఒమానీల కోసం 32 కొత్త ప్రొఫెషన్స్ రిజర్వ్.. జాబితా ఔట్..!
- ట్రాఫిక్ ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమా?