చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- September 22, 2023అమరావతి: రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ను విజయవాడలోని ఏసీబీ కోర్టు పొడిగించింది. మరో రెండు రోజుల పాటు మీరు రిమాండ్ లోనే ఉంటారని జడ్జి చంద్రబాబుకు తెలిపారు. ఈరోజుతో చంద్రబాబు రిమాండ్ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో జైలు నుంచి చంద్రబాబును వర్చువల్ గా కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు.
విచారణ సందర్భంగా… మిమ్మల్ని కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరుతోందని చంద్రబాబుకు జడ్జి తెలిపారు. మీకు విధించిన రిమాండ్ ను శిక్షగా భావించొద్దని చెప్పారు. జైల్లో మీకు ఇబ్బందేమైనా కలుగుతోందా? అని ప్రశ్నించారు. మీపై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయని, దర్యాప్తులో అన్నీ తేలుతాయని చెప్పారు. చట్టం అందరికీ సమానమేనని అన్నారు. ఇంకోవైపు, జైల్లో చంద్రబాబుకు కల్పిస్తున్న వసతులపై పూర్తి వివరాలను ఇవ్వాలని జైలు అధికారులను జడ్జి ఆదేశించారు.
తన గురించి దేశంలో, రాష్ట్రంలో అందరికీ తెలుసని జడ్జికి చంద్రబాబు తెలిపారు. రాజకీయ కక్షలో భాగంగానే తనను అరెస్ట్ చేశారని తెలిపారు. తన వివరణ తీసుకోకుండానే అరెస్ట్ చేశారని, తన అరెస్ట్ అక్రమమని చెప్పారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం కలిగిన తనకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. తన హక్కులను కాపాడాలని, న్యాయాన్ని రక్షించాలని జడ్జిని కోరారు. జైల్లో తనను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు చెప్పిన విషయాలను నోట్ చేసుకున్నట్టు జడ్జి తెలిపారు.
మరోవైపు చంద్రబాబు తరపు లాయర్లు తమ వాదననలు వినిపిస్తూ… చంద్రబాబును కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. మరోవైపు, చంద్రబాబు కస్టడీపై కాసేపట్లో తీర్పు వెలువడే అవకాశం ఉంది. కస్టడీ తీర్పు నేపథ్యంలో సర్వత్ర తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
తాజా వార్తలు
- విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత.. లైసెన్స్ పొందిన ట్రాన్స్ పోర్టల్స్ జాబితా విడుదల..!!
- భారతీయులకు శుభవార్త చెప్పిన యూఏఈ..ఆన్-అరైవల్ విస్తరణ..!!
- డిసెంబర్లో చరిత్ర సృష్టించనున్న ఒమన్.. ఎట్లాక్ సంచలన ప్రకటన..!!
- ఈ వీకెండ్ లో భారీ వర్షాలు.. ఖతార్ వాసులకు అలెర్ట్..!!
- AI-కెమెరాలు యాక్టివ్..6 నెలల్లో 1.5 మిలియన్ల నోటీసులు జారీ..!!
- సౌదీ అరేబియాలో క్రౌడ్ ఫండింగ్ నిబంధనల్లో కీలక మార్పులు..!!
- డల్లాస్లో దిగ్విజయంగా NATS వాలీబాల్ టోర్నమెంట్
- అంగరంగ వైభవంగా మహాత్మాగాంధీ మెమోరియల్ దశమ వార్షికోత్సవ వేడుకలు
- కాలేజీ అడ్మిషన్ల సంసిద్ధత పై అవగాహన కల్పించిన NATS
- అతిథి దేవో భవ 2024ను ప్రారంభించిన ఆర్జీఐఏ