పాలస్తీనియన్లను రక్షించాలని బహ్రెయిన్ రాజు పిలుపు
- October 18, 2023బహ్రెయిన్: హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా పాలస్తీనా పరిస్థితి మరింత దిగజారకుండా ఉండటానికి, నిర్బంధించబడిన పౌరుల విడుదల కోసం కృషి చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. గాజాకు వైద్య సహాయం, ఆహారం, నీరు మరియు విద్యుత్తు సదుపాయం కోసం అత్యవసర మానవతా కారిడార్లను తెరవాల్సిన అవసరం ఉందని HM రాజు చెప్పారు. న్యాయమైన శాంతి, స్థిరత్వాన్ని సాధించే దిశగా అన్ని ప్రయత్నాల సమన్వయానికి బహ్రెయిన్ రాజ్యం మద్దతు ఇస్తుందని పునరుద్ఘాటించారు. భద్రత, సుస్థిరతను బలోపేతం చేయడానికి మరియు ఈ ప్రాంతంలో శాంతిని పటిష్టం చేయడానికి బహ్రెయిన్ ఆసక్తిని.. పాలస్తీనా సమస్యకు న్యాయమైన పరిష్కారాన్ని కనుగొనడంలో వైఖరిని, పాలస్తీనా ప్రజలకు వారి చట్టబద్ధమైన హక్కులను అందించేందుకు బహ్రెయిన్ కట్టుబడి ఉందన్నారు. ఇటలీ పర్యటనలో భాగంగా రోమ్లోని ఇటాలియన్ ప్రధాన మంత్రి కార్యాలయంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో నిన్న సమావేశమైన సందర్భంగా ఆయన ఈ ప్రకటనలు చేశారు. ఈ సమావేశంలో, వారు రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలతో పాటు వారి ఉమ్మడి ప్రయోజనాలను సాధించే సహకారం, ఉమ్మడి చర్యల యొక్క వివిధ అంశాలను సమీక్షించారు.వారు తాజా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలు మరియు ప్రత్యేకించి గాజా స్ట్రిప్లోని పరిణామాల గురించి కూడా చర్చించారు. అంతర్జాతీయ శాంతి భద్రతల సేవలో అంతర్జాతీయ స్థాయిలో ఇటాలియన్ రిపబ్లిక్ పోషించిన ముఖ్యమైన పాత్రను హెచ్ఎం ది కింగ్ ప్రశంసించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్, విశాఖ నుంచి కొత్తగా మరిన్ని విమాన సర్వీసులు...!
- తిరిగి ఆనంద్ కు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ గా బాధ్యతలు..!!
- వినాయక పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మూడు జోన్లుగా హైడ్రా !
- గదిలో, బాత్రూంలో స్పై కెమెరాలు ఉంటే ఎలా గుర్తించాలి?
- మరింత ఈజీగా ఫ్లైట్ టికెట్ బుకింగ్
- నేడు శ్రీసప్తముఖ మహా శక్తి గణపతి పూజలో సీఎం రేవంత్
- 5.40లక్షల మంది సందర్శకులను ఆకర్షించిన ఆర్ట్ గ్యాలరీలు..!
- ఒమానీల కోసం 32 కొత్త ప్రొఫెషన్స్ రిజర్వ్.. జాబితా ఔట్..!
- ట్రాఫిక్ ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమా?