యూఏఈ లో తగ్గునున్ను చక్కెర ధరలు!
- November 21, 2023యూఏఈ: ప్రపంచ ధరల పెరుగుదల కారణంగా యూఏఈలో చక్కెర ధరలు గత రెండు నెలల్లో ఎనిమిది శాతం వరకు పెరిగాయి. అయితే నేషనల్ కోఆపరేటివ్ ఫర్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ (NCEL) ద్వారా ఇండియా చక్కెరను ఎగుమతి చేయడానికి అనుమతించింది. దీంతో యూఏఈలో చక్కెర ధరలు త్వరలో తగ్గుతాయని భావిస్తున్నారు. ఇటీవల స్థానిక ధరలను అదుపు చేసేందుకు భారత్ చక్కెర ఎగుమతులపై నిషేధం విధించింది. కాగా, ఈయూ, యూఎస్ లకు ఈ నిబంధనలు వర్తించవు. భారతదేశం తన చక్కెరను ఎగుమతి చేయగల NCEL క్రింద ఉన్న దేశాల జాబితాలో యూఏఈని కూడా చేర్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న స్టాక్ను ప్రధానంగా బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు అల్ ఆదిల్ ట్రేడింగ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ధనంజయ్ దాతర్ తెలిపారు. ‘‘గత రెండు నెలల్లో స్థానికంగా చక్కెర ధరలు ఎనిమిది శాతం పెరిగాయి. కానీ భారత చక్కెర స్థానిక మార్కెట్లోకి వచ్చిన తర్వాత, ధరలు తగ్గుతాయి, ”అని డాక్టర్ దాతర్ సోమవారం చెప్పారు.
తాజా వార్తలు
- హైదరాబాద్, విశాఖ నుంచి కొత్తగా మరిన్ని విమాన సర్వీసులు...!
- తిరిగి ఆనంద్ కు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ గా బాధ్యతలు..!!
- వినాయక పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మూడు జోన్లుగా హైడ్రా !
- గదిలో, బాత్రూంలో స్పై కెమెరాలు ఉంటే ఎలా గుర్తించాలి?
- మరింత ఈజీగా ఫ్లైట్ టికెట్ బుకింగ్
- నేడు శ్రీసప్తముఖ మహా శక్తి గణపతి పూజలో సీఎం రేవంత్
- 5.40లక్షల మంది సందర్శకులను ఆకర్షించిన ఆర్ట్ గ్యాలరీలు..!
- ఒమానీల కోసం 32 కొత్త ప్రొఫెషన్స్ రిజర్వ్.. జాబితా ఔట్..!
- ట్రాఫిక్ ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమా?