యూఏఈ లో తగ్గునున్ను చక్కెర ధరలు!
- November 21, 2023యూఏఈ: ప్రపంచ ధరల పెరుగుదల కారణంగా యూఏఈలో చక్కెర ధరలు గత రెండు నెలల్లో ఎనిమిది శాతం వరకు పెరిగాయి. అయితే నేషనల్ కోఆపరేటివ్ ఫర్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ (NCEL) ద్వారా ఇండియా చక్కెరను ఎగుమతి చేయడానికి అనుమతించింది. దీంతో యూఏఈలో చక్కెర ధరలు త్వరలో తగ్గుతాయని భావిస్తున్నారు. ఇటీవల స్థానిక ధరలను అదుపు చేసేందుకు భారత్ చక్కెర ఎగుమతులపై నిషేధం విధించింది. కాగా, ఈయూ, యూఎస్ లకు ఈ నిబంధనలు వర్తించవు. భారతదేశం తన చక్కెరను ఎగుమతి చేయగల NCEL క్రింద ఉన్న దేశాల జాబితాలో యూఏఈని కూడా చేర్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న స్టాక్ను ప్రధానంగా బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు అల్ ఆదిల్ ట్రేడింగ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ధనంజయ్ దాతర్ తెలిపారు. ‘‘గత రెండు నెలల్లో స్థానికంగా చక్కెర ధరలు ఎనిమిది శాతం పెరిగాయి. కానీ భారత చక్కెర స్థానిక మార్కెట్లోకి వచ్చిన తర్వాత, ధరలు తగ్గుతాయి, ”అని డాక్టర్ దాతర్ సోమవారం చెప్పారు.
తాజా వార్తలు
- UAE: సెప్టెంబర్ 1 తర్వాత వీసా ఉల్లంఘనలకు పాల్పడితే..?
- చికాగోలో NATS హైవే దత్తత కార్యక్రమం
- రేపు ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ గణేష్ శోభా యాత్ర మొదలు
- 4వ గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ & ఎక్స్పో ప్రారంభం
- ఒమాన్ లో రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే...
- మార్చి 2025 నాటికి గల్ఫ్ కు ఎయిర్ కేరళ సర్వీసులు
- కేరళలో నిఫా టెన్షన్
- 65 వసంతాలు పూర్తి చేసుకున్న దూరదర్శన్
- మెడికవర్ హాస్పిటల్స్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ విజయవంతం
- వరద బాధితులకు TANA ఫౌండేషన్ సహాయ కార్యక్రమాలు ముమ్మరం