బిఆర్ఎస్ శాసన సభాపక్ష నేతగా కెసిఆర్ ఎన్నిక
- December 10, 2023హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) శాసన సభాపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈమేరకు శనివారం ఉదయం తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ఎల్పీ మీటింగ్ జరిగింది. సీనియర్ లీడర్ కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు 37 మంది హాజరయ్యారు. శస్త్ర చికిత్స కారణంగా మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కెసిఆర్ గైర్హాజరయ్యారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కెటిఆర్ కూడా ఈ భేటీకి హాజరుకాలేదు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలుపొందిన బిఆర్ఎస్ శాసన సభలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించనుంది. ఈ నేపథ్యంలో పార్టీ శాసన సభాపక్ష నేతను ఎన్నుకోవడానికి శనివారం బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ మీటింగ్ లో తమ లీడర్ గా కెసిఆర్ ను ఎన్నుకుంటూ ఏకవాక్య తీర్మానం చేసి ఆమోదించారు. అనంతరం ఒకే బస్సులో ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.
తాజా వార్తలు
- హైదరాబాద్, విశాఖ నుంచి కొత్తగా మరిన్ని విమాన సర్వీసులు...!
- తిరిగి ఆనంద్ కు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ గా బాధ్యతలు..!!
- వినాయక పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మూడు జోన్లుగా హైడ్రా !
- గదిలో, బాత్రూంలో స్పై కెమెరాలు ఉంటే ఎలా గుర్తించాలి?
- మరింత ఈజీగా ఫ్లైట్ టికెట్ బుకింగ్
- నేడు శ్రీసప్తముఖ మహా శక్తి గణపతి పూజలో సీఎం రేవంత్
- 5.40లక్షల మంది సందర్శకులను ఆకర్షించిన ఆర్ట్ గ్యాలరీలు..!
- ఒమానీల కోసం 32 కొత్త ప్రొఫెషన్స్ రిజర్వ్.. జాబితా ఔట్..!
- ట్రాఫిక్ ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమా?