కేసీఆర్ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
- December 10, 2023హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. మొన్ననే సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకొని..
రెస్ట్ తీసుకుంటున్న కేసీఆర్ని క్రమంగా కోలుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి.. బాగోగులు తెలుసుకున్నారు. ఆ తర్వాత కేటీఆర్ను పలకరించి, కేసీఆర్ ఆరోగ్య విషయాలు తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట కాంగ్రెస్ నేతలు సీతక్క, షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు.
కేసీఆర్కి పూర్తి సహాయ సహకారాలు అందించాలనీ, అన్ని రకాల చర్యలూ తీసుకోవాలని సీఎస్ని ఆదేశించానన్న సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరినట్లు తెలిపారు. అలాగే.. కేసీఆర్ ప్రజల తరపున అసెంబ్లీలో మాట్లాడాలనీ, ఆయన సూచనలను అందించాలని, అసెంబ్లీకి రావాలని కోరినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ కోలుకుంటున్నట్లు డాక్టర్లు చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
ఇటీవల తన ఫామ్హౌస్లోని బాత్రూంలో కాలు జారి పడి, కాలికి గాయం అవ్వడంతో... సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు కేసీఆర్. ఆయనకు డాక్టర్లు.. హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. ఆ తర్వాత కేసీఆర్ నడిచారు కూడా. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రత్యేక డాక్టర్ల బృందం నిరంతరం ఆయన్ని పర్యవేక్షిస్తోంది.
కేసీఆర్ బాత్ రూమ్ నుంచి వస్తున్నప్పుడు ఆయన పంచె.. కాలు కింద చిక్కుకుంది. అదే సమయంలో నడుస్తుండగా.. కాలు జారి పడిపోయారని తెలిసింది. కొంతసేపు ఇంటిలోనే ఆయనకు సేవలు అందించారు. అయినప్పటికీ కాలు సమస్య తీరకపోవడంతో, ఆర్థరాత్రి రెండున్నర గంటల సమయంలో సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం కేసీఆర్ కోలుకుంటున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్, విశాఖ నుంచి కొత్తగా మరిన్ని విమాన సర్వీసులు...!
- తిరిగి ఆనంద్ కు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ గా బాధ్యతలు..!!
- వినాయక పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మూడు జోన్లుగా హైడ్రా !
- గదిలో, బాత్రూంలో స్పై కెమెరాలు ఉంటే ఎలా గుర్తించాలి?
- మరింత ఈజీగా ఫ్లైట్ టికెట్ బుకింగ్
- నేడు శ్రీసప్తముఖ మహా శక్తి గణపతి పూజలో సీఎం రేవంత్
- 5.40లక్షల మంది సందర్శకులను ఆకర్షించిన ఆర్ట్ గ్యాలరీలు..!
- ఒమానీల కోసం 32 కొత్త ప్రొఫెషన్స్ రిజర్వ్.. జాబితా ఔట్..!
- ట్రాఫిక్ ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమా?