కర్ణాటకలో ఘోర ప్రమాదం..కారు చెరువులో పడి నలుగురు మృతి
- December 10, 2023బెంగళూరు: కర్ణాటకలో జరిగిన ఘెర ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. చిక్ బళ్లాపూర్ లో కారు అదుపుతప్పి చెరువులో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. చిక్ బళ్లాపూర్ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు తెలియాల్సివుంది.
కాగా, అక్టోబర్ నెలలో చిక్ బళ్లాపూర్ 44వ జాతీయ రహదారిపై కారు ట్రక్కును ఢీకొనడంతో 13 మంది మృతి చెందారు. చిక్ బళ్లాపూర్ శివారులోని బెంగళూరు-హైదరాబాద్ హైవేపై రోడ్డు పక్కన ఆగి ఉన్న సిమెంట్ మిక్సర్ లారీని మల్టీ యుటిలిటీ వెహికల్ (ఎంయూవీ) ఢీకొట్టింది.
దీంతో ఆరేళ్ల బాలుడు, నలుగురు మహిళలు, పీయూ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి సహా 13 మంది మృతి చెందారు. బెంగళూరు నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిక్కబళ్లాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
చిత్రావతి జంక్షన్ వద్ద ఉదయం 6.30 గంటలకు 12 మంది ప్రయాణికులతో వెళ్తున్న టాటా సుమో, సిమెంట్ మిక్సర్ లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
తాజా వార్తలు
- హైదరాబాద్, విశాఖ నుంచి కొత్తగా మరిన్ని విమాన సర్వీసులు...!
- తిరిగి ఆనంద్ కు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ గా బాధ్యతలు..!!
- వినాయక పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మూడు జోన్లుగా హైడ్రా !
- గదిలో, బాత్రూంలో స్పై కెమెరాలు ఉంటే ఎలా గుర్తించాలి?
- మరింత ఈజీగా ఫ్లైట్ టికెట్ బుకింగ్
- నేడు శ్రీసప్తముఖ మహా శక్తి గణపతి పూజలో సీఎం రేవంత్
- 5.40లక్షల మంది సందర్శకులను ఆకర్షించిన ఆర్ట్ గ్యాలరీలు..!
- ఒమానీల కోసం 32 కొత్త ప్రొఫెషన్స్ రిజర్వ్.. జాబితా ఔట్..!
- ట్రాఫిక్ ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమా?