ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం..EC సంచలన నిర్ణయం
- April 20, 2024న్యూ ఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ పై మరోసారి కీలక ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఓటర్లను ప్రభావితం చేసే ఏ చర్యనూ సమర్థించలేమని తెలిపింది. పార్లమెంట్ ఎన్నికలకు సీఈసీ పకడ్బందీ ఏర్పాట్లుచేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎగ్జిట్ పోల్స్పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 19 శుక్రవారం నుంచి ఈ నిషేధం అమలులోకి వచ్చింది. 2024 జూన్ 1వ తేదీ సాయంత్రం 6:30 గంటల వరకూ ఈ నిషేధం అమలులో ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడించుకోవచ్చని ఈసీ తెలిపింది. దేశంలో మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి దశ పోలింగ్ శుక్రవారం ముగిసింది. ఈ విడతలో మొత్తం 21 రాష్ట్రాల్లోని 102 లోక్సభ నియోజక వర్గాల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 16.63 కోట్ల మంది ఓటర్లు.. 1.87 లక్షల పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. 18 లక్షల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 26న రెండో దశ ఎన్నికల జరుగనున్నాయి.
తాజా వార్తలు
- UAE: సెప్టెంబర్ 1 తర్వాత వీసా ఉల్లంఘనలకు పాల్పడితే..?
- చికాగోలో NATS హైవే దత్తత కార్యక్రమం
- రేపు ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ గణేష్ శోభా యాత్ర మొదలు
- 4వ గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ & ఎక్స్పో ప్రారంభం
- ఒమాన్ లో రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే...
- మార్చి 2025 నాటికి గల్ఫ్ కు ఎయిర్ కేరళ సర్వీసులు
- కేరళలో నిఫా టెన్షన్
- 65 వసంతాలు పూర్తి చేసుకున్న దూరదర్శన్
- మెడికవర్ హాస్పిటల్స్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ విజయవంతం
- వరద బాధితులకు TANA ఫౌండేషన్ సహాయ కార్యక్రమాలు ముమ్మరం