ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జులై 12న ఉప ఎన్నిక
- June 18, 2024న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల్లోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జులై 12న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎలక్షన్ కమిషన్ (EC) మంగళవారం ప్రకటించింది. ఎమ్మెల్సీల రాజీనామాలతో ఐదింటిలో మూడు స్థానాలకు ఉప ఎన్నిక తప్పనిసరైందని ఇసి తెలిపింది. అనర్హత వేటు కారణంగా మరో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ ఈ ఏడాది జనవరిలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న ధార్వాడా సెంట్రల్ స్థానం అసెంబ్లీ ఎన్నికలకు టిక్కెట్ నిరాకరించడంతో బిజెపిని వీడి కాంగ్రెస్లో చేరారు. లోక్సభ ఎన్నికలకు ముందు తిరిగి బిజెపిలో చేరి ఎంపిగా గెలిచారు. యుపిలోని సమాజ్ వాది పార్టీ అభ్యర్థి మౌర్య ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
సిట్టింగ్ సభ్యులపై అనర్హత వేటు వేయడంతో ఎపి, బీహార్లలో ఒక్కోసీటు ఖాళీ అయింది. ఏప్రిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ పార్టీకి రాజీనామా చేయడంతో ఎపి శాసనమండలిలో మరోస్థానం ఖాళీ అయింది.
తాజా వార్తలు
- ఖతార్ లో QR3.4bnకి చేరిన ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- పొంచువున్న ఎడారీకరణ ముప్పు..తక్షణ చర్యలకు సౌదీ అరేబియా పిలుపు..!!
- బహ్రెయిన్ లో దూసుకుపోతున్న లగ్జరీ కార్ మార్కెట్.. E- ట్రెండ్స్ ఫుల్ డిమాండ్..!!
- చిల్డ్రన్స్ నేషనల్ హాస్పిటల్కు.. యూఏఈ $35 మిలియన్ల విరాళం..!!
- గంటలో 3 కార్డియాక్ అరెస్టులు.. 33 ఏళ్ల ప్రవాసుడికి తప్పిన ప్రాణాపాయం..!!
- చాద్ ఫీల్డ్ హాస్పిటల్పై దుర్వినియోగ ఆరోపణలు..తీవ్రంగా ఖండించిన ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్..!!
- IIFA: మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డ్
- ఫేక్ ఇమ్మిగ్రేషన్ కాల్స్.. ప్రవాసులను హెచ్చరించిన భారతీయ కాన్సులేట్..!!
- గల్ఫ్ కార్మికులకు తెలంగాణ శుభవార్త..ప్రవాసి ప్రజావాణి కౌంటర్ ప్రారంభం
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్.. ఎంట్రీ ఫీజు తగ్గింపు..!!