సీఎం చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
- June 18, 2024![1 సీఎం చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం](https://www.maagulf.com/godata/articles/202406/CBN_1718718443.jpg)
అమరావతి: ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. తాజాగా గత ప్రభుత్వ హయాంలోని వివిధ పథకాల పేర్లు మార్చాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆదేశాల మేరకు పథకాల పేర్లని మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. జగన్ హయాంలో పలు స్కీమ్ లు తీసుకొచ్చారు. వాటిని జగన్, వైఎస్ఆర్ పేర్లతో అమలు చేశారు. తాజాగా ప్రభుత్వం మారిపోవడంతో ఆయా పథకాలు పేర్లు మార్చేశారు సీఎం చంద్రబాబు.
జగన్ పథకాల పేర్లు మార్చేసిన చంద్రబాబు ప్రభుత్వం..
- జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనల పథకాలకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ గా పేరు మార్పు.
- జగనన్న విదేశీ విద్యాదీవెనకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా పేరు మార్పు.
- వైఎస్సార్ కళ్యాణ మస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా పునరుద్దరణ.
- వైఎస్సార్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరు మార్పు.
- జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహాకానికి సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రొత్సాహాకాలుగా పథకం అమలు.
తాజా వార్తలు
- పెర్ఫ్యూమ్ షిప్మెంట్లో స్మగ్లింగ్ గుట్టురట్టు
- జపాన్ ఇ-వీసాలు నిలిపివేత.. సందిగ్ధంలో ట్రావెల్ ప్లాన్స్..!
- మహా నగరాలకు దీటుగా..అత్యాధునికంగా నీజెన్ డయాగ్నోస్టిక్స్
- సౌదీలో 3.6 తీవ్రతతో భూకంపం
- జూలైలో ఇంధన ధరలు తగ్గుతాయా?
- బస్సులో శవమై కనిపించిన ప్రవాసుడు
- మస్కట్ ఎక్స్ప్రెస్ వే.. పాక్షికంగా రీ ఓపెన్
- కొత్త లోగోకు సీఎం రేవంత్ ఆమోదం
- కొండగట్టుకు జనసేనాని..గజమాలతో భారీ ఎత్తున బ్రహ్మరథం..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరులో టీమిండియా..