సీఎం రేవంత్ రెడ్డితో లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ హెడ్ భేటీ

- June 18, 2024 , by Maagulf
సీఎం రేవంత్ రెడ్డితో లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ హెడ్ భేటీ

హైదరాబాద్: తెలంగాణ లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అగ్ర సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు ముందుగా రాగా..తాజాగా మంగళవారం లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ హెడ్ ఫెర్నాండెజ్..సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని సత్కరించారు.

ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, స్పేస్‌ విభాగంలో పెట్టుబడులు పెట్టేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో దావోస్‌లో చర్చలు సైతం జరిపింది. అయితే, లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ ఏరోస్పేస్, మిలిటరీ సపోర్ట్, సెక్యూరిటీ, టెక్నాలజీస్ పరిశ్రమలో అతిపెద్ద కంపెనీలలో ఒకటి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com