తప్పుడు వార్తల పై కువైట్ మంత్రివర్గం సీరియస్..!
- June 26, 2024![1 తప్పుడు వార్తల పై కువైట్ మంత్రివర్గం సీరియస్..!](https://www.maagulf.com/godata/articles/202406/FG_1719396984.jpg)
కువైట్: విశ్వసనీయత మరియు జాతీయ ప్రయోజనాలను ప్రమాదంలో నెట్టివేసే సోషల్ మీడియా , ఇతర మీడియా వార్తలను కువైట్ కేబినెట్ తప్పుబట్టింది. పుకార్లు మరియు తప్పుడు సమాచారం తీవ్రమైన అనర్ధాలను కలుగజేస్తుందని పేర్కొంది. ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబాహ్ అధ్యక్షతన బయాన్ ప్యాలెస్లో మంత్రివర్గం సమావేశమైంది. మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు తీసుకున్న చర్యలపై ఇటీవల అవాస్తవ నివేదికలను ప్రచురించినందుకు ఇది కొన్ని సోషల్ మీడియా సైట్లు మరియు వార్తా సేవలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు వార్తలను ప్రచురించడం లేదా తిరిగి ప్రచురించడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చింది. పుకార్లు మరియు తప్పుడు సమాచారంతో ప్రమేయం ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఎంక్యాట్ పై అవగాహన కల్పించిన NATS
- APPSC ఛైర్మన్ పదవికి గౌతమ్ సవాంగ్ రాజీనామా
- TANA ప్రపంచ సాహిత్యవేదిక 'ప్రతిభామూర్తుల జీవితచరిత్రల' సదస్సు విజయవంతం
- భక్తులను మోసం చేస్తున్న దళారులపై చట్టపరమైన చర్యలు: TTD EO
- తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్లో కీలక పరిణామం..
- ఎక్స్-ఫుడ్ ట్రక్ ఉద్యోగికి కాసేషన్ కోర్టులో చుక్కెదురు
- హత్య కేసులో నిందితుడైన కొడుకు.. కోర్టును ఆశ్రయించిన తండ్రి
- మూన్ దీవిలో డైవర్ ను కాపాడిన రాయల్ ఫ్యామిలీ మెంబర్..!
- టెలిగ్రామ్ నుండి 18.6 మిలియన్ల కంటెంట్ తొలగింపు
- కువైట్ లో ప్రవాసులకు ప్రింటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ..!