తప్పుడు వార్తల పై కువైట్ మంత్రివర్గం సీరియస్..!
- June 26, 2024![1 తప్పుడు వార్తల పై కువైట్ మంత్రివర్గం సీరియస్..!](https://www.maagulf.com/godata/articles/202406/FG_1719396984.jpg)
కువైట్: విశ్వసనీయత మరియు జాతీయ ప్రయోజనాలను ప్రమాదంలో నెట్టివేసే సోషల్ మీడియా , ఇతర మీడియా వార్తలను కువైట్ కేబినెట్ తప్పుబట్టింది. పుకార్లు మరియు తప్పుడు సమాచారం తీవ్రమైన అనర్ధాలను కలుగజేస్తుందని పేర్కొంది. ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబాహ్ అధ్యక్షతన బయాన్ ప్యాలెస్లో మంత్రివర్గం సమావేశమైంది. మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు తీసుకున్న చర్యలపై ఇటీవల అవాస్తవ నివేదికలను ప్రచురించినందుకు ఇది కొన్ని సోషల్ మీడియా సైట్లు మరియు వార్తా సేవలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు వార్తలను ప్రచురించడం లేదా తిరిగి ప్రచురించడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చింది. పుకార్లు మరియు తప్పుడు సమాచారంతో ప్రమేయం ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- TGSPDCL వెబ్సైట్ ద్వారానే విద్యుత్ బిల్లులు
- డిసెంబర్ 12 నుంచి ‘మనామా హెల్త్ కాంగ్రెస్-ఎక్స్పో 2024’
- కువైట్ చేపల పేరుతో మోసాలు.. దుకాణాలు సీజ్
- ఒమన్ లో 'లైవ్ ది వైబ్' ప్రచారం ప్రారంభం
- 6-రోజులు వర్సెస్ 4-రోజుల వర్క్ వీక్.. జోరుగా చర్చ
- సౌదీలో హెల్త్ క్లస్టర్లకు ఆమోదం
- కొత్త ఎస్పోర్ట్స్, గేమ్ డిజైన్ అకాడమీ.. విద్యార్థులకు స్కాలర్షిప్లు
- నడిరోడ్డు పై కుప్పకూలిన విమానం..ముగ్గురు మృతి
- పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- షార్జాలో రెసిడెన్షియల్ టవర్ లో అగ్నిప్రమాదం