79 మంది ఏజెంట్లు, పంపిణీదారులపై జరిమానా
- June 27, 2024రియాద్: 2023 సంవత్సరంలో కాంపిటీషన్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఏజెంట్లు మరియు పంపిణీదారులతో సహా ఆటోమొబైల్ రంగంలో పనిచేస్తున్న 79 సంస్థలపై అభియోగాలను సౌదీ జనరల్ అథారిటీ ఫర్ కాంపిటీషన్ నమోదు చేసింది. వీటిలో 64 సంస్థలపై అథారిటీ క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం మిగిలిన 15 సంస్థలపై ఉన్న కేసుల పరిష్కారం కోసం సమర్పించిన అభ్యర్థనలను పరిశీలిస్తోంది. వివిధ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అథారిటీ తన నివేదికలో పేర్కొంది. వీటిలో మూడు ఫార్మసీలు, నాలుగు రిటైల్ మార్కెట్లు ఉన్నాయి. పౌల్ట్రీ మరియు గుడ్ల ఉత్పత్తి రంగంలో పనిచేస్తున్న మూడు సంస్థలు నిబంధనలు ఉల్లంఘించి తక్కువ ధరలను నిర్ణయంచడంపై కేసులు నమోదయ్యయి. SR600 మిలియన్ల బిడ్లలో ప్రధాన కంపెనీలతో కుమ్మక్కైనందుకు ఆరు సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సెటిల్మెంట్ లకు సంబంధించిన పక్రియను నిర్వహించడంలో విఫలమైనందుకు రెండు హోల్సేల్ సంస్థలపై క్రిమినల్ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్టు అథారిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- మెట్రో రైడర్స్ కు గుడ్ న్యూస్.. ఈ-స్కూటర్లపై నిషేధం ఎత్తివేత..!!
- షార్ట్స్లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి
- రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం
- తిరుమల తిరుపతి శ్రీవారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు
- ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వైరం ఏమిటి? ఎందుకు?
- ఇండియాకు పన్నెండు ఐఫోన్ 16 తీసుకొస్తూ.. పట్టుబడ్డ ప్రయాణికులు..!!
- అబుదాబిలో వేటాడుతూ.. రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ వేటగాళ్లు..!!
- సౌదీ అరేబియాలో ఇన్బౌండ్ విజిటర్స్ వ్యయంలో 8.2% వృద్ధి..!!
- GCC-IMF సమావేశం.. ‘ఎకనామిక్స్ ఛాలెంజెస్’పై కీలక సమీక్ష..