79 మంది ఏజెంట్లు, పంపిణీదారులపై జరిమానా
- June 27, 2024![1 79 మంది ఏజెంట్లు, పంపిణీదారులపై జరిమానా](https://www.maagulf.com/godata/articles/202406/ccc_1719464166.jpg)
రియాద్: 2023 సంవత్సరంలో కాంపిటీషన్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఏజెంట్లు మరియు పంపిణీదారులతో సహా ఆటోమొబైల్ రంగంలో పనిచేస్తున్న 79 సంస్థలపై అభియోగాలను సౌదీ జనరల్ అథారిటీ ఫర్ కాంపిటీషన్ నమోదు చేసింది. వీటిలో 64 సంస్థలపై అథారిటీ క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం మిగిలిన 15 సంస్థలపై ఉన్న కేసుల పరిష్కారం కోసం సమర్పించిన అభ్యర్థనలను పరిశీలిస్తోంది. వివిధ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అథారిటీ తన నివేదికలో పేర్కొంది. వీటిలో మూడు ఫార్మసీలు, నాలుగు రిటైల్ మార్కెట్లు ఉన్నాయి. పౌల్ట్రీ మరియు గుడ్ల ఉత్పత్తి రంగంలో పనిచేస్తున్న మూడు సంస్థలు నిబంధనలు ఉల్లంఘించి తక్కువ ధరలను నిర్ణయంచడంపై కేసులు నమోదయ్యయి. SR600 మిలియన్ల బిడ్లలో ప్రధాన కంపెనీలతో కుమ్మక్కైనందుకు ఆరు సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సెటిల్మెంట్ లకు సంబంధించిన పక్రియను నిర్వహించడంలో విఫలమైనందుకు రెండు హోల్సేల్ సంస్థలపై క్రిమినల్ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్టు అథారిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- పోర్చుగల్ను ఓడించి.. సెమీస్కు చేరిన ఫ్రాన్స్
- ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్ తో ముగిసిన క్రిక్ ఖతార్ క్రికెట్ టోర్నమెంట్
- హత్రాస్ ఘటన పై మౌనం వీడిన భోలే బాబా..
- ఇటలీలో బూడిదమయమైన విమానాశ్రయం..
- తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..
- నియంత్రిత ఔషధాల కోసం ఆన్లైన్ సేవ..బహ్రెయిన్
- భయంకరంగా ఢీకొట్టుకున్న వాహనాలు..హెచ్చరిక జారీ
- రెసిడెన్సీ ఉల్లంఘనదారులపై కువైట్ కొరడా
- దోఫర్ గవర్నరేట్లో విద్యుత్ సమస్యలకు చెక్..!
- ప్రపంచ ప్రతిభావంతులకు సౌదీ పౌరసత్వం