రామోజీరావు సంస్మరణ సభకు హాజరైన ప్రముఖులు
- June 27, 2024![1 రామోజీరావు సంస్మరణ సభకు హాజరైన ప్రముఖులు](https://www.maagulf.com/godata/articles/202406/VJA_1719504154.jpg)
విజయవాడ: ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ గురువారం విజయవాడలోని కానూరులో జరిగింది.ఈ సంస్మరణ సభకు అతిరథ మహారథులు హాజరయ్యారు.రామోజీరావు కుటుంబ సభ్యులతో పాటు, ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, మనోహర్, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, పార్థసారథి పాల్గొన్నారు.
సినీ ప్రముఖులు మురళీమోహన్, జయసుధ, రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, అశ్వినీదత్, ఆదిశేషగిరిరావు, దగ్గుబాటి సురేష్, శ్యాంప్రసాద్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రామోజీరావు ఛాయాచిత్ర ప్రదర్శనను సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తిలకించారు. వేదిక వద్ద రామోజీరావుకు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, లోకేశ్ పుష్పాంజలి ఘటించారు.
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (88) తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. 8 జూన్ 2024 న తుదిశ్వాస విడిచారు. జూన్ 10 న రామోజీఫిల్మ్ సిటీ లో తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి.
తాజా వార్తలు
- ప్రాంతీయ భద్రతకు బహ్రెయిన్, సౌదీ చర్యలు..!
- ఏడాది పొడవునా ఫ్రీ మెడికల్ చికిత్సలు
- 2023లో అర్థిక వృద్ధిలో ఒమన్ దూకుడు
- ఉద్యోగులపై వేధింపులు.. 6నెలల జైలుశిక్ష, Dh5,000జరిమానా
- కువైట్ లో ఆరవ తరం కెమెరా సిస్టమ్ ప్రారంభం
- లెబనాన్ విడిచి వెళ్లాలి.. సౌదీ పౌరులకు అలెర్ట్
- పెన్షన్లపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన టీడీపీ
- నైజీరియాలో దారుణం..18 మందికి పైగా మృతి
- పిఠాపురంకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్...
- దుబాయ్ హిల్స్ మాల్కు కొత్త బస్సు సర్వీస్