యూఏఈ పాస్ OTP రిక్వెస్ట్ వచ్చిందా?
- June 28, 2024![1 యూఏఈ పాస్ OTP రిక్వెస్ట్ వచ్చిందా?](https://www.maagulf.com/godata/articles/202406/bbb_1719575529.jpg)
యూఏఈ: యూఏఈ పాస్ అభ్యర్థనల పేరిట సరికొత్త మోసాలకు మోసగాళ్లు తెరలేపారు. యూఏఈ పాస్ అప్డేట్ చేసుకోవాలని అడగడం ద్వారా నివాసితులను మోసగించడం ద్వారా సున్నితమైన మరియు వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్నారని పోలీసులు, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. విషింగ్ (వాయిస్ ఫిషింగ్) కుంభకోణం యూఏఈ నివాసితులు ఎదుర్కొంటున్న కొత్త తరహా మోసం. అలాంటి పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. యూఏఈ అధికారులమని చెబుతూ స్కామర్ల నుండి ఫోన్ కాల్స్ లేదా ఇమెయిల్లు వస్తున్నట్లు అనేక మంది నివాసితులు చెప్పారు. స్కామర్ల వ్యూహాలకు లొంగిపోయే వారు వ్యక్తిగతంగా మరియు ఆర్థికంగా నష్టపోతారని పోలీసులు హెచ్చరించారు.
స్కామ్ ప్రయత్నాల గురించి సోషల్ మీడియాలో టెలికమ్యూనికేషన్స్ మరియు డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ (TDRA) స్పందించింది. యూఏఈ పాస్ అధిక-భద్రతా ప్రమాణాల గురించి ప్రజలకు హామీ ఇచ్చింది. నివాసితులు మరియు పౌరులకు సురక్షితమైన డిజిటల్ గుర్తింపు పరిష్కారంగా పేర్కొంది. పాస్కి లింక్ చేయబడిన OTP, నోటిఫికేషన్లు లేదా లాగిన్ అభ్యర్థనలను స్వీకరించేటప్పుడు జాగ్రత్త వహించాలని అథారిటీ చెప్పింది.
స్కామర్లు నిరంతరం తమ విధానాన్ని మార్చుకుంటూ బాధితులను మోసం చేసేందుకు సరికొత్త వ్యూహాలను అవలంబిస్తున్నారు. తెలియని సోర్స్ నుండి సాధారణ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేయడం మానుకోవాలి. ఫిషింగ్ ఇమెయిల్ల నుండి వచ్చే కాల్స్ కు స్పందించవద్దు. స్కామర్లు మీ ఇమెయిల్ మరియు ఫోన్కు (హానికరమైన మొబైల్ యాప్ల ద్వారా) యాక్సెస్ కలిగి ఉంటే, యాక్సెస్ కోడ్లను తిరిగి పొందగలిగితే, ఖాతాను రీసెట్ చేయవచ్చు. పాస్వర్డ్లను క్రమం తప్పకుండా అప్డేట్ చేయాలి. OTPని షేర్ చేసిన తర్వాతనే లావాదేవీ పూర్తవుతుంది. అయితే మీ ఖాతాను సురక్షితంగా ఉంచుకోవడానికి మీరు సర్వీస్ ప్రొవైడర్ను తొందరగా సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- నీజెన్ డయాగ్నోస్టిక్స్ ప్రారంభం
- వాట్సాప్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
- హైదరాబాద్లోని పబ్లలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
- టీటీడీ ఈవో శ్యామలరావు కీలక నిర్ణయం
- ప్రాంతీయ భద్రతకు బహ్రెయిన్, సౌదీ చర్యలు..!
- ఏడాది పొడవునా ఫ్రీ మెడికల్ చికిత్సలు
- 2023లో అర్థిక వృద్ధిలో ఒమన్ దూకుడు
- ఉద్యోగులపై వేధింపులు.. 6నెలల జైలుశిక్ష, Dh5,000జరిమానా
- కువైట్ లో ఆరవ తరం కెమెరా సిస్టమ్ ప్రారంభం
- లెబనాన్ విడిచి వెళ్లాలి.. సౌదీ పౌరులకు అలెర్ట్