కొండగట్టుకు జనసేనాని..గజమాలతో భారీ ఎత్తున బ్రహ్మరథం..

- June 29, 2024 , by Maagulf
కొండగట్టుకు జనసేనాని..గజమాలతో భారీ ఎత్తున బ్రహ్మరథం..

అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కొండ గట్టుకు స్టార్ట్ అయ్యారు. ఈక్రమంలో జనసేన కార్యకర్తలు, పవన్  అభిమానులు దారిపొడగున బ్రహ్మరథం పట్టారు.ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ క రోడ్డు మార్గం ద్వారా కొండగట్టుకు వెళ్తున్నారు. దీంతో తెలంగాణ పోలీసులు కూడా ప్రత్యేక భద్రతలను చేపట్టారు. ఇదిలా ఉండగా..  సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి వద్ద జనసేన అధినేతకు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. భారీగా గజమాలను ఏర్పాటుచేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

 పవన్ అక్కడికి చేరుకొగానే గజమాలతో స్వాగతం తెలిపారు. ఇదిలా ఉండగా.. తమ అభిమాన నటుడిని చూసి, పవన్ అభిమానులు ఫుల్ జోష్ తో నినాదాలు చేశారు. అంతేకాకుండా.. ఫోటోలు దిగుతూ..సెల్ఫీలు దిగుతూ తమ ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. పవన్ కు గజమాల సమర్పించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్  గా మారింది.

పవన్ కాసేపు.. సిద్దిపేటలో తన అభిమానులతో మాట్లాడి.. ఆతర్వాత కొండగట్టుక పయనమయ్యారు. మరోవైపు ఒకవైపుశనివారం వీకెంట్ కావడంతో కొండ గట్టులో రద్దీ కాస్త ఎక్కువగానే ఉంటుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ వస్తుండటంతో జనసేన ఫ్యాన్స్, పవన్  అభిమానులు భారీగా ఇప్పటికే కొండ గట్టుకు చేరుకున్నారు. రెండు వేల మందితో పోలీసులు భద్రతను చేపట్టినట్లు తెలుస్తోంది.

మరోవైపు..సాధారణ భక్తులకు  ఇబ్బందులు కల్గకుండా అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు అంజన్న ఆలయంలో పూజలు చేశాక, చేనెత కార్మికులతో, జనసేన పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమౌతారని తెలుస్తోంది. ఆ తర్వాత  సాయంత్రం తిరిగి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు వెళ్లిపోనున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com