కొత్త లోగోకు సీఎం రేవంత్ ఆమోదం

- June 29, 2024 , by Maagulf
కొత్త లోగోకు సీఎం రేవంత్ ఆమోదం

హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటి వరకు అమల్లో ఉన్న హరితహారం కార్యక్రమాన్ని 'వన మహోత్సవం'గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించిన లోగోను ప్రభుత్వం ఆవిష్కరించింది. పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ రూపొందించిన ఈ లోగోను ముఖ్యమంత్రి ఆమోదించారు. వర్షా కాలం ప్రారంభమైన నేపథ్యంలో పట్టణ, పల్లె ప్రాంతాల్లో వన మహోత్సవం కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. నిజానికి వన మహోత్సవం పేరు గతంలోనే ఉండేది. 1950లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే 75 సంవత్సరాలు పూర్తిచే సుకుంటున్న నేపథ్యంలో తాజా కార్యక్రమానికి 'వజ్రోత్సవ వన మహోత్సవం'గా రాష్ట్ర ప్రభుత్వం కొత్తపేరు పెట్టింది. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా మొక్కలు నాటడంతో పాటు, నాటిన మొక్కల సంరక్షణకు సంబంధిత శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com