కొత్త లోగోకు సీఎం రేవంత్ ఆమోదం
- June 29, 2024![1 కొత్త లోగోకు సీఎం రేవంత్ ఆమోదం](https://www.maagulf.com/godata/articles/202406/MM_1719660076.jpg)
హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటి వరకు అమల్లో ఉన్న హరితహారం కార్యక్రమాన్ని 'వన మహోత్సవం'గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించిన లోగోను ప్రభుత్వం ఆవిష్కరించింది. పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ రూపొందించిన ఈ లోగోను ముఖ్యమంత్రి ఆమోదించారు. వర్షా కాలం ప్రారంభమైన నేపథ్యంలో పట్టణ, పల్లె ప్రాంతాల్లో వన మహోత్సవం కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. నిజానికి వన మహోత్సవం పేరు గతంలోనే ఉండేది. 1950లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే 75 సంవత్సరాలు పూర్తిచే సుకుంటున్న నేపథ్యంలో తాజా కార్యక్రమానికి 'వజ్రోత్సవ వన మహోత్సవం'గా రాష్ట్ర ప్రభుత్వం కొత్తపేరు పెట్టింది. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా మొక్కలు నాటడంతో పాటు, నాటిన మొక్కల సంరక్షణకు సంబంధిత శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
తాజా వార్తలు
- TGSPDCL వెబ్సైట్ ద్వారానే విద్యుత్ బిల్లులు
- డిసెంబర్ 12 నుంచి ‘మనామా హెల్త్ కాంగ్రెస్-ఎక్స్పో 2024’
- కువైట్ చేపల పేరుతో మోసాలు.. దుకాణాలు సీజ్
- ఒమన్ లో 'లైవ్ ది వైబ్' ప్రచారం ప్రారంభం
- 6-రోజులు వర్సెస్ 4-రోజుల వర్క్ వీక్.. జోరుగా చర్చ
- సౌదీలో హెల్త్ క్లస్టర్లకు ఆమోదం
- కొత్త ఎస్పోర్ట్స్, గేమ్ డిజైన్ అకాడమీ.. విద్యార్థులకు స్కాలర్షిప్లు
- నడిరోడ్డు పై కుప్పకూలిన విమానం..ముగ్గురు మృతి
- పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- షార్జాలో రెసిడెన్షియల్ టవర్ లో అగ్నిప్రమాదం