కొత్త లోగోకు సీఎం రేవంత్ ఆమోదం
- June 29, 2024![1 కొత్త లోగోకు సీఎం రేవంత్ ఆమోదం](https://www.maagulf.com/godata/articles/202406/MM_1719660076.jpg)
హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటి వరకు అమల్లో ఉన్న హరితహారం కార్యక్రమాన్ని 'వన మహోత్సవం'గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించిన లోగోను ప్రభుత్వం ఆవిష్కరించింది. పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ రూపొందించిన ఈ లోగోను ముఖ్యమంత్రి ఆమోదించారు. వర్షా కాలం ప్రారంభమైన నేపథ్యంలో పట్టణ, పల్లె ప్రాంతాల్లో వన మహోత్సవం కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. నిజానికి వన మహోత్సవం పేరు గతంలోనే ఉండేది. 1950లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే 75 సంవత్సరాలు పూర్తిచే సుకుంటున్న నేపథ్యంలో తాజా కార్యక్రమానికి 'వజ్రోత్సవ వన మహోత్సవం'గా రాష్ట్ర ప్రభుత్వం కొత్తపేరు పెట్టింది. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా మొక్కలు నాటడంతో పాటు, నాటిన మొక్కల సంరక్షణకు సంబంధిత శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
తాజా వార్తలు
- ఎంక్యాట్ పై అవగాహన కల్పించిన NATS
- APPSC ఛైర్మన్ పదవికి గౌతమ్ సవాంగ్ రాజీనామా
- TANA ప్రపంచ సాహిత్యవేదిక 'ప్రతిభామూర్తుల జీవితచరిత్రల' సదస్సు విజయవంతం
- భక్తులను మోసం చేస్తున్న దళారులపై చట్టపరమైన చర్యలు: TTD EO
- తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్లో కీలక పరిణామం..
- ఎక్స్-ఫుడ్ ట్రక్ ఉద్యోగికి కాసేషన్ కోర్టులో చుక్కెదురు
- హత్య కేసులో నిందితుడైన కొడుకు.. కోర్టును ఆశ్రయించిన తండ్రి
- మూన్ దీవిలో డైవర్ ను కాపాడిన రాయల్ ఫ్యామిలీ మెంబర్..!
- టెలిగ్రామ్ నుండి 18.6 మిలియన్ల కంటెంట్ తొలగింపు
- కువైట్ లో ప్రవాసులకు ప్రింటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ..!