బహ్రెయిన్ లో 26% పెరిగిన లేబర్ అథారిటీ తనిఖీలు
- June 30, 2024మనామా: బహ్రెయిన్ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) ఇటీవలే దాని త్రైమాసిక కార్యాచరణ నివేదికను విడుదల చేసింది. 2023 (జనవరి 1 నుండి జూన్ 20, 2024 వరకు) ఇదే కాలంతో పోలిస్తే అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఉమ్మడి తనిఖీ ప్రయత్నాలలో దాదాపు 26% పెరుగుదల నమోదైనట్టు సీఈఓ నిబ్రాస్ మొహమ్మద్ తాలిబ్ తెలిపారు. ఉమ్మడి ప్రచారాలు 306 నుండి 358కి పెరిగాయని,తనిఖీ సందర్శనలు సుమారు 20,000 నుండి 25,200కి పెరిగినట్టు వెల్లడించారు. కార్మికులకు సకాలంలో న్యాయమైన పరిహారం అందించడం లక్ష్యంగా ప్రైవేట్ రంగం సహకారంతో వేతన రక్షణ వ్యవస్థలో తాజా పరిణామాలపై ఆయన స్పందించారు. పని నాణ్యతను పెంపొందించడంపై దృష్టి సారించడంతోపాటు వ్యాపార యజమానుల కోసం విధానాలను క్రమబద్ధీకరించడానికి మరియు సేవలను మెరుగుపరచడానికి అనేక కార్యక్రమాలను తీసుకురానున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- సూరత్ లో కుప్పకూలిన అపార్ట్మెంట్–ఏడుగురు దుర్మరణం
- ఆషాఢమాస బోనాల ఉత్సవాలు షురూ..
- $32 మిలియన్ల విలువైన రాకెట్ బస్ట్..25 మంది అరెస్ట్
- మాబ్ ఫైట్..పలువురు అరెస్ట్
- కువైట్ లో డొమెస్టిక్ వీసా..వర్క్ వీసాకు బదిలీ
- డ్రైవ్ సందర్భంగా గొడవ..స్నేహితుడి పై దాడి..!
- ఇజ్రాయెల్ చర్యలను ఖండించండి.. యూరప్ను కోరిన సౌదీ
- షార్జాలో ఉచిత పార్కింగ్
- హైదరాబాద్లోని ప్రజాభవన్లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ
- ముహారం.. హుసైనియాకు కీలక సూచనలు జారీ