పిఠాపురంకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్...
- June 30, 2024![1 పిఠాపురంకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్...](https://www.maagulf.com/godata/articles/202406/pl_1719726530.jpg)
అమరావతి: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తొలిసారి పవన్ పిఠాపురంలో అడుగుపెట్టనున్నారు. మూడు రోజులు పిఠాపురంలోనే పవన్ పర్యటన కొనసాగనుంది. జులై 1, 2, 3 తేదీల్లో కాకినాడ జిల్లా పుఠాపురంలోనే పవన్ బస చేయనున్నారు. దీంతో పవన్ కల్యాణ్ కు ఘన స్వాగతం పలికేందుకు జనసైనికులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మూడు రోజుల పర్యటనలో భాగంగా.. జూలై 1వ తేదీ (రేపు) ఉదయం విమానంలో హైదరాబాద్ నుండి రాజమండ్రికి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేరుకుంటారు. రోడ్డు మార్గంలో గొల్లప్రోలు మండలం గొల్లప్రోలులో సత్య కృష్ణ కన్వెన్షన్ హల్ లో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం చేబ్రోలు నివాసానికి చేరుకుని పిఠాపురం నాయకులతో, వీర మహిళలతో, స్థానిక ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. 2వ తేదీన కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలనుండి 11:30 వరకు పంచాయతీ శాఖ అధికారులతో, 11:30 నుండి 12:30 వరకు జల వనరుల శాఖ అధికారులతో, 12:30 నుండి 1:30 వరకు అటవీ శాఖ అధికారులతో, 1.30 నుండి 2 గంటల వరకు రహదారుల పరిస్థితి పై పవన్ కల్యాణ్ సమీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం చేబ్రోలు నివాసానికి చేరుకుని జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు.
మూడోరోజు (జూలై 3వ తేదీ) ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గంలో ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో కోతకు గురవుతున్న ప్రాంతాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారు. మధ్యాహ్నం పిఠాపురం నియోజకవర్గంలోని అధికారులతో పరిచయ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం టీడీపీ, బీజేపీ నాయకులతో సమావేశం అవుతారు. పిఠాపురం నియోజవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు పిఠాపురంలో సాయంత్రం నాలుగు గంటలకు వారాహి బహిరంగ సభలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. బహిరంగ సభ అనంతరం అక్కడి నుండి విజయవాడ బయలుదేరి వెళ్తారు.
తాజా వార్తలు
- అన్విత గ్రూప్ రూ.2,000 కోట్ల భారీ గృహ సముదాయ ప్రాజెక్టు: సీఎండీ అచ్యుతరావు బొప్పన
- ఇంకా పరారీలోనే భోలే బాబా, కీలక ప్రకటన చేసిన పోలీసులు
- ఇసుకను బ్లాక్ లో అమ్మితే బొమ్మ చూపిస్తాం...స్ట్రాంగ్ వార్ణింగ్ ఇచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర
- 2 కిలోగ్రాముల డ్రగ్స్ స్వాధీనం.. అనుమానితులు అరెస్ట్
- ఒమన్ - జిసిసి మధ్య కీలక ఒప్పందం
- కార్మికులకు ఉచిత నీరు, ఐస్ క్రీం పంపిణీ
- హజెమ్ అల్ థెమైడ్ స్ట్రీట్ తాత్కాలికంగా మూసివేత
- సౌదీలో అమల్లోకి కొత్త సామాజిక బీమా చట్టం..బెనిఫిట్స్..!
- IPL మానియా గెస్ & విన్ కాంటెస్ట్.. విజేతలకు గిఫ్ట్స్ అందజేత
- రూ.5వేలతో పుష్పక్ ఏసీ జనరల్ బస్పాస్