2030 నాటికి దుబాయ్ లో 32 కొత్త మెట్రో స్టేషన్లు
- July 01, 2024యూఏఈ: ఎమిరేట్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆదివారం దుబాయ్ మెట్రో డెవలప్మెంట్ ప్లాన్ను ఆమోదించింది. రాబోయే కొద్ది సంవత్సరాల్లో ప్రయాణికుల కోసం మరిన్ని స్టేషన్లను అందుబాటులోకి తేనున్నారు. 2030 నాటికి 84 చదరపు కిలోమీటర్లలో ఉన్న 64 స్టేషన్లను 140 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ 96 స్టేషన్లకు పెంచడం ఈ విస్తరణ లక్ష్యం. ఈ ప్రణాళిక షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మరియు షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ దృష్టిలో భాగంగా తీసుకురానున్నారు. ప్రజా రవాణా వాటాను 45 శాతానికి పెంచడం, తలసరి కార్బన్ ఉద్గారాలను 16 టన్నులకు తగ్గించడం, నడకను ప్రోత్సహించడానికి బహిరంగ ప్రదేశాల నాణ్యతను మెరుగుపరచడం మరియు నీడ ఉన్న ప్రాంతాలను పెంచడం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నారు. మెట్రో డెవలప్మెంట్ ప్లాన్తో పాటు, కౌన్సిల్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ఆమోదించారు. ఇది 2033 నాటికి దుబాయ్కి Dh650 బిలియన్ల పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఉంది.
తాజా వార్తలు
- ఎక్స్-ఫుడ్ ట్రక్ ఉద్యోగికి కాసేషన్ కోర్టులో చుక్కెదురు
- హత్య కేసులో నిందితుడైన కొడుకు.. కోర్టును ఆశ్రయించిన తండ్రి
- మూన్ దీవిలో డైవర్ ను కాపాడిన రాయల్ ఫ్యామిలీ మెంబర్..!
- టెలిగ్రామ్ నుండి 18.6 మిలియన్ల కంటెంట్ తొలగింపు
- కువైట్ లో ప్రవాసులకు ప్రింటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ..!
- ఒమన్లో ప్రమోషన్లకు అనుమతి అవసరం లేదు
- శ్రీవారికి నివేదించే అన్న ప్రసాదాల తయారీలో మార్పు.. టీటీడీ క్లారిటీ
- తెలుగు రాష్ట్రాలకు వచ్చేస్తున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా మహేశ్ చంద్ర లడ్హా నియామకం
- రేపు బ్రిటన్లో ఎన్నికలు.. ఎన్నికల పోల్స్ రిషి సునక్ గురించి ఏమంటున్నాయంటే..