నడిరోడ్డు పై కుప్పకూలిన విమానం..ముగ్గురు మృతి

- July 01, 2024 , by Maagulf
నడిరోడ్డు పై కుప్పకూలిన విమానం..ముగ్గురు మృతి

పారిస్: పారిస్ లో నడిరోడ్డు మీద విమానం కూలింది.పారిస్ లోని డిస్నీల్యాండ్ సమీపంలో ఏ4 మోటార్ వే పై చిన్న ప్యాసింజర్ విమానం కూలిపోయింది. తలకిందులుగా రోడ్డుపై పడడంతో అందులోని ముగ్గురు ప్రయాణికులు స్పాట్ లోనే చనిపోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ పోలీసులతో కలిసి అక్కడికి చేరుకుంది. గాయాలపాలైన వారిని ఎయిర్ అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించింది. తక్కువ ఎత్తులో ఎగురుతుండగా ఓ విద్యుత్ తీగ తగలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com