గన్నవరం ఎయిర్పోర్ట్లో కార్గో సేవలు పునఃప్రారంభం..
- July 01, 2024విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గన్నవరం ఎయిర్పోర్టులో కార్గో సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. నేటి నుంచి సేవలు అందబాటులోకి వచ్చాయని.. అందరూ ఉపయోగించుకోవాలని విమానాశ్రయం అధికారులు తెలిపారు. రాబోయే అంతర్జాతీయ సర్వీస్ (కార్గో కోసం) నడిపేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. వాస్తవానికి 2021లోనే కార్గో సేవలు ప్రారంభంకావాల్సి ఉండగా.. కోవిడ్ కారణంగా వాయిదా పడింది. మళ్లీ ఇప్పటికి సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి.
గన్నవరం ఎయిర్ పోర్టులో ఒమేగా కంపెనీ కార్గో సర్వీసును పునరుద్ధరించడం అభినందనీయం అని గన్నవరం ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత రెడ్డి అన్నారు. కార్గో సర్వీస్ తో గన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. గన్నవరం విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు గణనీయంగా పెరిగాయని.. అందుకు అనుగుణంగా కార్గో సర్వీస్ ప్రారంభించడం శుభసూచికమన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన 69 ఏళ్ల హార్ట్ సర్జన్ మసౌద్ పెజెష్కియాన్
- పోర్చుగల్ను ఓడించి.. సెమీస్కు చేరిన ఫ్రాన్స్
- ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్ తో ముగిసిన క్రిక్ ఖతార్ క్రికెట్ టోర్నమెంట్
- హత్రాస్ ఘటన పై మౌనం వీడిన భోలే బాబా..
- ఇటలీలో బూడిదమయమైన విమానాశ్రయం..
- తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..
- నియంత్రిత ఔషధాల కోసం ఆన్లైన్ సేవ..బహ్రెయిన్
- భయంకరంగా ఢీకొట్టుకున్న వాహనాలు..హెచ్చరిక జారీ
- రెసిడెన్సీ ఉల్లంఘనదారులపై కువైట్ కొరడా
- దోఫర్ గవర్నరేట్లో విద్యుత్ సమస్యలకు చెక్..!