అమరావతి, పోలవరం పూర్తికి సహకరించాలి: ఎంపీ బాలశౌరీ
- July 02, 2024![1 అమరావతి, పోలవరం పూర్తికి సహకరించాలి: ఎంపీ బాలశౌరీ](https://www.maagulf.com/godata/articles/202407/MP_1719929771.jpg)
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంతోపాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని మచిలీపట్నం జనసేన ఎంపీ బాలశౌరీ కేంద్రాన్ని కోరారు. మంగళవారం పార్లమెంట్ లో రాష్ట్రపతి ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన పలు అంశాల పై సహకారం అందించాలని కేంద్రాన్ని కోరారు.
మచిలీపట్నం పోర్ట్ లో రిఫైనరీ పెట్టాలని, మచిలీపట్నం–రేపల్లే మధ్య రైల్వే లైన్ ఏర్పాలు చేయాలని, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ప్రతి ఇంటికి మంచినీరు అందజేయడంతోపాటు గ్రీన్ ఎనర్జీని అందజేసే ప్రాజెక్టులను ప్రోత్సాహించాలని కేంద్రాన్ని కోరారు. ఏపీలోని కౌలు రైతులకు తక్కువ వడ్డీ రుణాలు అందజేయాలని ప్రత్యేకంగా ప్రధాని మోదీని ఎంపీ బాలశౌరీ కోరారు.
తాజా వార్తలు
- సూరత్ లో కుప్పకూలిన అపార్ట్మెంట్–ఏడుగురు దుర్మరణం
- ఆషాఢమాస బోనాల ఉత్సవాలు షురూ..
- $32 మిలియన్ల విలువైన రాకెట్ బస్ట్..25 మంది అరెస్ట్
- మాబ్ ఫైట్..పలువురు అరెస్ట్
- కువైట్ లో డొమెస్టిక్ వీసా..వర్క్ వీసాకు బదిలీ
- డ్రైవ్ సందర్భంగా గొడవ..స్నేహితుడి పై దాడి..!
- ఇజ్రాయెల్ చర్యలను ఖండించండి.. యూరప్ను కోరిన సౌదీ
- షార్జాలో ఉచిత పార్కింగ్
- హైదరాబాద్లోని ప్రజాభవన్లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ
- ముహారం.. హుసైనియాకు కీలక సూచనలు జారీ