అమరావతి, పోలవరం పూర్తికి సహకరించాలి: ఎంపీ బాలశౌరీ

- July 02, 2024 , by Maagulf
అమరావతి, పోలవరం పూర్తికి సహకరించాలి: ఎంపీ బాలశౌరీ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంతోపాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని మచిలీపట్నం జనసేన ఎంపీ బాలశౌరీ కేంద్రాన్ని కోరారు. మంగళవారం పార్లమెంట్ లో రాష్ట్రపతి ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన పలు అంశాల పై సహకారం అందించాలని కేంద్రాన్ని కోరారు.

మచిలీపట్నం పోర్ట్ లో రిఫైనరీ పెట్టాలని, మచిలీపట్నం–రేపల్లే మధ్య రైల్వే లైన్ ఏర్పాలు చేయాలని, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ప్రతి ఇంటికి మంచినీరు అందజేయడంతోపాటు గ్రీన్ ఎనర్జీని అందజేసే ప్రాజెక్టులను ప్రోత్సాహించాలని కేంద్రాన్ని కోరారు. ఏపీలోని కౌలు రైతులకు తక్కువ వడ్డీ రుణాలు అందజేయాలని ప్రత్యేకంగా ప్రధాని మోదీని ఎంపీ బాలశౌరీ కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com