‘విరాజి’తో రాబోతున్న వరుణ్ సందేశ్..
- July 02, 2024వరుణ్ సందేశ్ ఇటీవలే నింద సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాబోతున్నాడు.తాజాగా నేడు వరుణ్ సందేశ్ తన నెక్స్ట్ సినిమా ‘విరాజి’ అని టైటిల్ అనౌన్స్ చేసారు. ఈ సినిమాని మహా మూవీస్ తో కలిసి M3 మీడియా బ్యానర్ పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాణంలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, ప్రసాద్ బెహరా.. పలువురు నటించారు.
విరాజి సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఆగస్టు 2న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ‘విరాజి’ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ నిర్వహించారు. టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో చూస్తుంటే హారర్, థ్రిల్లర్ స్టోరీ అని తెలుస్తుంది.
విరాజి సినిమా నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ.. ఇది చాలా మంచి టైటిల్. వరుణ్ సందేశ్ గారు ఇప్పటిదాకా చాలా మంచి సినిమాలు చేసారు. ఆయన్ని కొత్త అవతారంలో ఈ సినిమా చూపిస్తుంది. ఆగస్టు 2న సినిమా రిలీజ్ చేస్తాం. నెల రోజుల్లో ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తాం అని తెలిపారు.
డైరెక్టర్ ఆద్యంత్ హర్ష మాట్లాడుతూ.. డైరెక్టర్ గా ఇది నా మొదటి సినిమా, ఇది నా మొదటి ఈవెంట్. మా మూవీ ప్రాజెక్ట్ హెడ్ సుకుమార్ కిన్నెరకి, ప్రొడ్యూసర్ మహేంద్రకి థ్యాంక్స్ చెప్పాలి. వరుణ్ సందేశ్ ఎంతో సపోర్ట్ చేసారు.వరుణ్ సందేశ్ కు ఇది టైలర్ మేడ్ మూవీ అవుతుంది అని తెలిపారు.
వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. విరాజి కథ చెప్పేటప్పుడు పది నిమిషాల తర్వాత కథ ఇలా ఉంటుందేమో అని రెండు మూడు చోట్ల గెస్ చేశాను.సెకండాఫ్ విని నాకు గూస్ బంప్స్ వచ్చాయి. కథ చాలా బాగుంది. డైరెక్టర్ హర్ష కు లాంగ్ కెరీర్ ఉంటుంది. నేను ఇటీవల చేసిన నింద సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.పదేళ్ల తర్వాత నా సినిమాకి అలాంటి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.నింద సినిమా సక్సెస్ నాకు మంచి మోటివేషన్, బూస్ట్ ఇచ్చింది. విరాజి సినిమాకు ఇంకో నెల రోజులు మాత్రమే టైం ఉంది. నా 17 ఏళ్ల కెరీర్ లో ఒక డిఫరెంట్ సినిమా ఇది. ఈ నెల 10వ తేదీన విరాజి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాం.ఈ క్యారెక్టర్ కోసం రెడీ అవ్వడానికి గంట సమయం పట్టేది. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను అని తెలిపారు.
తాజా వార్తలు
- గోవా రైల్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చ జెండా
- టీచర్లకు గోల్డెన్ వీసా..అక్టోబర్ 15 నుండి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..!!
- రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తున్న పింక్ సైక్లిస్టులు..!!
- మహ్బూల్లాలో ఇంధన స్టేషన్..తీరిన ప్రయాణికుల కష్టాలు..!!
- సీబ్ ఫామ్లో అగ్నిప్రమాదం..తప్పిన ప్రాణాప్రాయం..!!
- ఎమిరేట్స్ ఐడి లేకుంటే విమానాశ్రయాల్లో కష్టాలు..ప్రవాస భారతీయులకు అలెర్ట్..!!
- ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం..130 మంది టీచర్లకు ప్రమోషన్లు..!!
- దుబాయిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు..
- ఎంత ఎదిగినా మన మూలాలు, సంస్కృతి, సాంప్రదాయలను మరవొద్దు: మంత్రి జూపల్లి