రూ.5వేలతో పుష్పక్ ఏసీ జనరల్ బస్పాస్
- July 04, 2024హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ శంషాబాద్ విమానాశ్రయానికి నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌకర్యార్థం ‘పుష్పక్ ఏసీ జనరల్ బస్పాస్’ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ.5 వేలు. ఈ పాస్తో ఏ బస్సులోనైనా, సిటీలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. పుష్పక్ పాస్తోపాటు శంషాబాద్, ఆరాంఘర్, బాలాపూర్ క్రాస్రోడ్స్, ఎల్బీనగర్, గచ్చిబౌలి నుంచి విమానాశ్రయానికి రూట్పాస్, గ్రీన్ మెట్రో గ్రేటర్జోన్లోని ప్రయాణికుల కోసం మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో రూ.1900తో నెలవారీ పాస్ను తీసుకొచ్చింది.
ఇది సికింద్రాబాద్-పటాన్చెరు (219), బాచుపల్లి-వేవ్రాక్ వయా జేఎన్టీయూ (195), కోఠి-కొండాపూర్ (127కే) మార్గాల్లో చెల్లుబాటు అవుతుంది. రూట్పాస్ ధరలను రూ. 2 వేల నుంచి రూ. 4 వేలుగా నిర్ణయించింది. శంషాబాద్ నుంచి రూ. 2 వేలు, ఆరాంఘర్, బాలాపూర్ క్రాస్రోడ్ నుంచి రూ. 3 వేలు, ఎల్బీనగర్, గచ్చిబౌలి నుంచి రూ. 4 వేలుగా పాస్ ధరలను నిర్ణయించింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ హాలిడేస్..లెజెండ్స్ మ్యాచ్ కోసం స్పెషల్ ప్యాకేజీలు..!!
- తుబ్లీ కారు దొంగతనం..మహిళా జైలుశిక్ష రద్దు..!!
- ఖైతాన్లో ట్రాఫిక్ క్యాంపెయిన్.. 51 మంది అరెస్టు..!!
- అల్ దఖిలియాలో ఒంటె రేసులు ప్రారంభం..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ గైడ్.. టిక్కెట్లు, ప్రత్యేకతలు..!!
- ముహైస్నా బ్రిడ్జి సమీపంలో ప్రమాదం..వాహనం బోల్తా..!!
- సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఎదురుదెబ్బ..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సౌదీ నుంచి స్వదేశానికి చేరిన నిర్మల్ జిల్లావాసి
- లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు
- మహిళా టీ20 ప్రపంచకప్..భారత్ పై న్యూజిలాండ్ విజయం