సీఎం రేవంత్రెడ్డి కామెంట్స్..స్పందించిన ఫిలిం ఛాంబర్..
- July 04, 2024హైదరాబాద్: ఇటీవల యాంటీ నార్కోటిక్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిపార్ట్మెంట్స్ కు నూతన వాహనాల శ్రేణిని ప్రారంభించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్కు కీలక సూచనలు చేశారు. డ్రగ్స్ వినియోగం, సైబర్ క్రైమ్పై మూవీల్లో అవగాహన కల్పించాలన్నారు. అలా కల్పించని వారి సినిమాలకు టికెట్ల ధరలు పెంచే ప్రసక్తే లేదన్నారు. వందల కోట్ల బడ్జెట్ మూవీ అయినప్పటికీ సైబర్ క్రైమ్, డ్రగ్స్ కు దూరంగా ఉండాలంటూ సినిమాకు ముందు ప్రదర్శించాలని సూచించారు.
సినిమా టికెట్ల ధరలు పెంచాలని ప్రభుత్వం దగ్గరకు నిర్మాతలు వస్తుంటారని, కానీ వీటిపై అవగాహన కల్పించడం లేదని తెలిపారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై సినిమాకు ముందు కానీ సినిమా తరువాత 3 నిమిషాలు వీడియోతో అవగాహన కల్పించాలని చెప్పారు. అలా చేయని నిర్మాతలకు , డైరెక్టర్లకు, తారాగణానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ఉండవన్నారు. సినిమా థియేటర్ల యాజమాన్యాలు కూడా సహకరించాలని, డ్రగ్స్, సైబర్ నేరాలపై థియేటర్లలో ప్రసారం చేయకపోతే వారి థియేటర్లుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
ఈ అంశం పై తెలుగు ఫిలిం ఛాంబర్ స్పందించింది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రతినిధులు కలిసినప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన విషయాలపై సానుకూలంగా స్పందించినట్లు చెప్పింది.
సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణ వంటి విషయాలలో చలన చిత్ర పరిశ్రమ ముందుండి ప్రభుత్వానికి అండగా ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయం పై చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్స్ యాజమాన్యాలు.. డ్రగ్స్, సైబర్ నేరాలను అరికట్టడానికి తమవంతు భాధ్యత నిర్వర్తించడానికి ఇకపైన కూడా ఎల్లవేళలా తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉంటుంది. దీనిపై అతి త్వరలో సీఎం కలవనున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ హాలిడేస్..లెజెండ్స్ మ్యాచ్ కోసం స్పెషల్ ప్యాకేజీలు..!!
- తుబ్లీ కారు దొంగతనం..మహిళా జైలుశిక్ష రద్దు..!!
- ఖైతాన్లో ట్రాఫిక్ క్యాంపెయిన్.. 51 మంది అరెస్టు..!!
- అల్ దఖిలియాలో ఒంటె రేసులు ప్రారంభం..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ గైడ్.. టిక్కెట్లు, ప్రత్యేకతలు..!!
- ముహైస్నా బ్రిడ్జి సమీపంలో ప్రమాదం..వాహనం బోల్తా..!!
- సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఎదురుదెబ్బ..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సౌదీ నుంచి స్వదేశానికి చేరిన నిర్మల్ జిల్లావాసి
- లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు
- మహిళా టీ20 ప్రపంచకప్..భారత్ పై న్యూజిలాండ్ విజయం