స్ఫూర్తిమంతంగా సింగపూర్ తెలుగు సమాజం రక్తదాన కార్యక్రమం
- July 04, 2024సింగపూర్: 22 జూన్ 2024 న సింగపూర్ లోని శ్రీ సెంపగ వినాయక దేవాలయ ప్రాంగణం @ 19, సిలోన్ రోడ్ సింగపూర్ తెలుగు సమాజం, శ్రీ సత్యసాయి గ్లోబల్ ఆర్గనైజేషన్ సింగపూర్, శ్రీ సెంపగ వినాయగర్ టెంపుల్, సింగపూర్ సిలోన్ తమిళ్ అసోసియేషన్ మరియు మునీశ్వరన్ కమ్యూనిటీ సర్వీసెస్ సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగపూర్లోని తెలుగు,తమిళం,కన్నడ,మలయాళం,హిందీ మరియు స్ధానిక ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 120 మంది దాతలు రక్తదానం చేశారు.
సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి దాతలను అభినందించారు. రక్తదానం గురించి అందరూ అవగాహన పెంచుకోవాలని కోరారు.అందరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. సింగపూర్ తెలుగు సమాజం ఇలాంటి రక్తదాన శిబిరాలను అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తోందన్నారు. అయితే సాటి ఇతర భారతీయ మూలాలు కలిగిన స్థానిక సింగపూర్ భారతీయులతో కలిసి నిర్వహించడం విశేషం.
ప్రత్యేకించి కొవిడ్-19 మహమ్మారి సమయంలో 9 సార్లు రక్తదాన శిబిరాలని నిర్వహించి తెలుగు సమాజం రికార్డు సృష్టించింది.రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు నిర్వాహకులు పాలెపు మల్లిక్ గుర్తు చేశారు.ఈ శిబిరానికి వైదా మహేష్, రాపేటి జనార్ధన రావు , జ్యోతీశ్వర్ రెడ్డి సమన్వయకర్తలుగా వ్యవహరించారు.
దాతలు, పరిశీలకులు, సేవాదళం సభ్యులకు సింగపూర్ తెలుగు సమాజం ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.అందరి సమష్టి కృషితోనే కార్యక్రమం విజయవంతమైనదన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ హాలిడేస్..లెజెండ్స్ మ్యాచ్ కోసం స్పెషల్ ప్యాకేజీలు..!!
- తుబ్లీ కారు దొంగతనం..మహిళా జైలుశిక్ష రద్దు..!!
- ఖైతాన్లో ట్రాఫిక్ క్యాంపెయిన్.. 51 మంది అరెస్టు..!!
- అల్ దఖిలియాలో ఒంటె రేసులు ప్రారంభం..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ గైడ్.. టిక్కెట్లు, ప్రత్యేకతలు..!!
- ముహైస్నా బ్రిడ్జి సమీపంలో ప్రమాదం..వాహనం బోల్తా..!!
- సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఎదురుదెబ్బ..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సౌదీ నుంచి స్వదేశానికి చేరిన నిర్మల్ జిల్లావాసి
- లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు
- మహిళా టీ20 ప్రపంచకప్..భారత్ పై న్యూజిలాండ్ విజయం