23 ఏళ్ల వ్యక్తికి 30,000 దిర్హామ్ల జరిమానా
- July 05, 2024దుబాయ్: మాదకద్రవ్యాల వినియోగానికి పాల్పడిన అరబ్ వ్యక్తికి 30,000 దిర్హామ్ జరిమానా విధించారు. రెండేళ్లపాటు ఇతరులకు లేదా ఇతరుల ద్వారా డబ్బును బదిలీ చేయడం లేదా డిపాజిట్ చేయకుండా ఆంక్షలు విధించారు. మాదకద్రవ్యాల వినియోగం మరియు నగదు బదిలీకి సంబంధించిన చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినందుకు 23 ఏళ్ల వ్యక్తికి దుబాయ్ క్రిమినల్ కోర్టు జరిమానా విధించింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, యూఏఈ సెంట్రల్ బ్యాంక్ అనుమతితో మాత్రమే నిందితులు బ్యాంక్ సేవలను ఉపయోగించుకోవచ్చని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
జనవరి 16 అల్ బార్షా పోలీస్ స్టేషన్ పరిధిలో చట్టపరమైన ప్రిస్క్రిప్షన్ లేకుండానే నిందితుడు మెథాంఫేటమిన్ మరియు యాంఫేటమిన్ అనే రెండు సైకోయాక్టివ్ పదార్ధాలను రెండవసారి వినియోగించినట్లు గుర్తించారు. అతను మరొక వ్యక్తికి చెందిన బ్యాంకు ఖాతాకు డబ్బును బదిలీ చేయడం ద్వారా డ్రగ్స్ కోసం చెల్లించాడని కూడా న్యాయవాదులు తెలిపారు. జరిమానా చెల్లించని పక్షంలో చెల్లించని ప్రతి 100 దిర్హామ్లకు ఒక రోజు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తులు తెలిపారు.
తాజా వార్తలు
- గోవా రైల్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చ జెండా
- టీచర్లకు గోల్డెన్ వీసా..అక్టోబర్ 15 నుండి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..!!
- రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తున్న పింక్ సైక్లిస్టులు..!!
- మహ్బూల్లాలో ఇంధన స్టేషన్..తీరిన ప్రయాణికుల కష్టాలు..!!
- సీబ్ ఫామ్లో అగ్నిప్రమాదం..తప్పిన ప్రాణాప్రాయం..!!
- ఎమిరేట్స్ ఐడి లేకుంటే విమానాశ్రయాల్లో కష్టాలు..ప్రవాస భారతీయులకు అలెర్ట్..!!
- ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం..130 మంది టీచర్లకు ప్రమోషన్లు..!!
- దుబాయిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు..
- ఎంత ఎదిగినా మన మూలాలు, సంస్కృతి, సాంప్రదాయలను మరవొద్దు: మంత్రి జూపల్లి