నిర్లక్ష్యంగా డ్రైవింగ్.. వారించిన వృద్ధ జంటపై యువకుడు దాడి
- July 05, 2024మనామా: 22 ఏళ్ల యువకుడు రోడ్డు ప్రమాద ఘటన తర్వాత వృద్ధ దంపతులపై హింసాత్మక దాడికి పాల్పడ్డాడు. ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంపై వారు కొప్పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కోర్టు డాక్యుమెంట్స్ ప్రకారం.. 57 మరియు 62 సంవత్సరాల వయస్సు గల దంపతులు తమ వాహనాన్ని నడుపుతున్నప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. తన సొంత కారును నడుపుతున్న నిందితుడు ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా నడపడం చూసిన జంట సదరు డ్రైవర్ ను హెచ్చరించడానికి హారన్ కొట్టారు. ట్రాఫిక్ లైట్ వద్దకు రాగానే ఇద్దరు తమ వాహనాలను ఆపారు. ఈ సమయంలో నిందితుడు కారు దిగి, దంపతుల పట్ల అసభ్యకరంగా మాట్లాడాడు. ముగ్గురు వ్యక్తులు కారు నుండి దిగి ఆ జంటపై దాడికి పాల్పడ్డారు. 57 ఏళ్ల వ్యక్తిని తన్నడంతో అతను పడిపోయాడు. అతని ఎడమ కాలు విరిగింది. ప్రాసిక్యూషన్ విచారణలో నిందితుడు దాడిని అంగీకరించాడు. 57 ఏళ్ల బాధితుడు 12% శాశ్వత వైకల్యంతో బాధపడుతున్నాడని వైద్య నివేదిక ధృవీకరించింది. 62 ఏళ్ల బాధితుడు కూడా ఈ సంఘటనలో గాయపడినట్టు పేర్కొన్నారు. వాదనలు విన్న కోర్టు.. జూలై 8న తీర్పును వెలువరించనుంది.
తాజా వార్తలు
- గోవా రైల్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చ జెండా
- టీచర్లకు గోల్డెన్ వీసా..అక్టోబర్ 15 నుండి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..!!
- రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తున్న పింక్ సైక్లిస్టులు..!!
- మహ్బూల్లాలో ఇంధన స్టేషన్..తీరిన ప్రయాణికుల కష్టాలు..!!
- సీబ్ ఫామ్లో అగ్నిప్రమాదం..తప్పిన ప్రాణాప్రాయం..!!
- ఎమిరేట్స్ ఐడి లేకుంటే విమానాశ్రయాల్లో కష్టాలు..ప్రవాస భారతీయులకు అలెర్ట్..!!
- ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం..130 మంది టీచర్లకు ప్రమోషన్లు..!!
- దుబాయిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు..
- ఎంత ఎదిగినా మన మూలాలు, సంస్కృతి, సాంప్రదాయలను మరవొద్దు: మంత్రి జూపల్లి