నిర్లక్ష్యంగా డ్రైవింగ్.. వారించిన వృద్ధ జంటపై యువకుడు దాడి
- July 05, 2024మనామా: 22 ఏళ్ల యువకుడు రోడ్డు ప్రమాద ఘటన తర్వాత వృద్ధ దంపతులపై హింసాత్మక దాడికి పాల్పడ్డాడు. ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంపై వారు కొప్పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కోర్టు డాక్యుమెంట్స్ ప్రకారం.. 57 మరియు 62 సంవత్సరాల వయస్సు గల దంపతులు తమ వాహనాన్ని నడుపుతున్నప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. తన సొంత కారును నడుపుతున్న నిందితుడు ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా నడపడం చూసిన జంట సదరు డ్రైవర్ ను హెచ్చరించడానికి హారన్ కొట్టారు. ట్రాఫిక్ లైట్ వద్దకు రాగానే ఇద్దరు తమ వాహనాలను ఆపారు. ఈ సమయంలో నిందితుడు కారు దిగి, దంపతుల పట్ల అసభ్యకరంగా మాట్లాడాడు. ముగ్గురు వ్యక్తులు కారు నుండి దిగి ఆ జంటపై దాడికి పాల్పడ్డారు. 57 ఏళ్ల వ్యక్తిని తన్నడంతో అతను పడిపోయాడు. అతని ఎడమ కాలు విరిగింది. ప్రాసిక్యూషన్ విచారణలో నిందితుడు దాడిని అంగీకరించాడు. 57 ఏళ్ల బాధితుడు 12% శాశ్వత వైకల్యంతో బాధపడుతున్నాడని వైద్య నివేదిక ధృవీకరించింది. 62 ఏళ్ల బాధితుడు కూడా ఈ సంఘటనలో గాయపడినట్టు పేర్కొన్నారు. వాదనలు విన్న కోర్టు.. జూలై 8న తీర్పును వెలువరించనుంది.
తాజా వార్తలు
- బొగత జలపాతానికి పర్యాటకుల సందడి
- ఒమన్లో OMR23.58 బిలియన్లకు చేరుకున్న లిక్విడిటీ
- కువైట్ లో వారానికి 8,700 విజిట్ వీసాలు జారీ
- ఏలూరు జిల్లాలో NATS మెగా ఉచిత వైద్య శిబిరం
- రాగి, ఎలక్ట్రికల్ కేబుల్ చోరీ.. విదేశీ ముఠాకు పదేళ్ల జైలు శిక్ష
- ప్రపంచ హెల్త్ కేర్ ర్యాంకింగ్.. మెరుగుపడ్డ ఖతార్
- కేవలం ఎమిరాటైజేషన్ కోసమే నియామకాలు..!
- టీడీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- తెలంగాణలో 35 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం!
- దివంగత నేత వైఎస్ఆర్కు కుటుంబ సభ్యుల ఘన నివాళులు