నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌.. వారించిన వృద్ధ జంటపై యువకుడు దాడి

- July 05, 2024 , by Maagulf
నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌.. వారించిన వృద్ధ జంటపై యువకుడు దాడి

మనామా: 22 ఏళ్ల యువకుడు రోడ్డు ప్రమాద ఘటన తర్వాత వృద్ధ దంపతులపై హింసాత్మక దాడికి పాల్పడ్డాడు. ట్రాఫిక్‌ నిబంధనలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడంపై వారు కొప్పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కోర్టు డాక్యుమెంట్స్ ప్రకారం.. 57 మరియు 62 సంవత్సరాల వయస్సు గల దంపతులు తమ వాహనాన్ని నడుపుతున్నప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. తన సొంత కారును నడుపుతున్న నిందితుడు ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా నడపడం చూసిన జంట సదరు డ్రైవర్ ను హెచ్చరించడానికి హారన్ కొట్టారు.  ట్రాఫిక్ లైట్ వద్దకు రాగానే ఇద్దరు తమ వాహనాలను ఆపారు. ఈ సమయంలో నిందితుడు కారు దిగి, దంపతుల పట్ల అసభ్యకరంగా మాట్లాడాడు. ముగ్గురు వ్యక్తులు కారు నుండి దిగి ఆ జంటపై దాడికి పాల్పడ్డారు. 57 ఏళ్ల వ్యక్తిని తన్నడంతో అతను పడిపోయాడు.  అతని ఎడమ కాలు విరిగింది.  ప్రాసిక్యూషన్‌ విచారణలో నిందితుడు దాడిని అంగీకరించాడు. 57 ఏళ్ల బాధితుడు 12% శాశ్వత వైకల్యంతో బాధపడుతున్నాడని వైద్య నివేదిక ధృవీకరించింది. 62 ఏళ్ల బాధితుడు కూడా ఈ సంఘటనలో గాయపడినట్టు పేర్కొన్నారు. వాదనలు విన్న కోర్టు.. జూలై 8న తీర్పును వెలువరించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com