హైదరాబాద్లో ర్యాలీ వద్దన్న ఏపీ సీఎం చంద్రబాబు..
- July 05, 2024అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగించుకుని మరికాసేపట్లో హైదరాబాద్కు రానున్నారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ వస్తున్న ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ వరకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, తోరణాలతో ఈ రూటు పసుపు మాయంగా మారింది.
బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి భారీ ర్యాలీగా చంద్రబాబును ఆయన నివాసానికి తోడ్కోని పోవాలని టీడీపీ నాయకులు భావించారు. నగర వాసులు ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ర్యాలీ వద్దని టీటీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. బేగంపేట నుంచి నేరుగా తన కాన్వాయ్లో నివాసానికి ఆయన చేరుకుంటారు.
ఎయిర్పోర్టులోకి కొద్ది మంది నాయకులను మాత్రమే అనుమతించనున్నారు. 40 మంది తెలంగాణ తెలుగుదేశం నాయకులకు మాత్రమే చంద్రబాబును కలిసేందుకు అనుమతిస్తారని సమాచారం. వారితో మాట్లాడిన తర్వాత ర్యాలీ లేకుండానే చంద్రబాబు తన నివాసానికి వెళ్లిపోతారు. కాగా, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఇప్పటికే బేగంపేట విమానాశ్రయానికి చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రేపు ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్ లో ఈ సమావేశం జరగనుంది. రెండు రాష్ట్రాల మధ్య విభజన అంశాలపై ఈ భేటీలో చర్చిస్తారు. ముఖ్యనేతల మధ్య జరిగే సమావేశానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.
తాజా వార్తలు
- గోవా రైల్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చ జెండా
- టీచర్లకు గోల్డెన్ వీసా..అక్టోబర్ 15 నుండి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..!!
- రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తున్న పింక్ సైక్లిస్టులు..!!
- మహ్బూల్లాలో ఇంధన స్టేషన్..తీరిన ప్రయాణికుల కష్టాలు..!!
- సీబ్ ఫామ్లో అగ్నిప్రమాదం..తప్పిన ప్రాణాప్రాయం..!!
- ఎమిరేట్స్ ఐడి లేకుంటే విమానాశ్రయాల్లో కష్టాలు..ప్రవాస భారతీయులకు అలెర్ట్..!!
- ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం..130 మంది టీచర్లకు ప్రమోషన్లు..!!
- దుబాయిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు..
- ఎంత ఎదిగినా మన మూలాలు, సంస్కృతి, సాంప్రదాయలను మరవొద్దు: మంత్రి జూపల్లి